ఈసారి 400 సీట్లు దాటొచ్చు.. ఖర్గే వీడియో వైరల్

కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘అబ్ కీ బార్, 400 పార్’ అంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబధించిన వీడియో ‘క్లిప్‌’ను బీజేపీ అధికారికి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *