భరత్ తో, ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్, విడాకులు… అధికారిక ప్రకటన .

ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్ తన పన్నెండేళ్ల వివాహ బంధానికి తెర దించుతూ భర్త భరత్ తఖ్తానీతో విడాకులు తీసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరికీ 2012 లో వివాహం జరిగింది. . గత కొన్ని వారాలుగా వీరిద్దరి గురించి బాలీవుడ్ లో అనేక వార్తలు వస్తుండటం, హేమమాలిని 75వ జన్మదిన సంబరాలకు భరత్ దూరంగా ఉండటంతో, వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు బాగా వ్యాప్తి చెందాయి.

దీనికి సమాధానంగా ఈషా డియోల్, ఆమె భర్త ఇద్దరూ కలిపి అధికారికంగా తామిద్దరూ విడిపోతున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇద్దరం స్నేహితులుగా కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు , రాధ్యా(7), మిరయా(5) వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *