Delhi excise case: ….సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఎక్సైజ్ పాలసీ కేసు , మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది

కోర్టు ఆదేశాలపై చట్ట ప్రకారం చర్చలు తీసుకుంటామని ఆమ్ ఆద్మీ తెలిపింది. చట్టవిరుద్ధంగా ఈడీ ఇచ్చిన ఆదేశాలను కోర్టుకు వివరిస్తామని తెలిపింది. కేజ్రీవాల్ ఇంతవరకూ ఐదుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినా గైర్హాజరయ్యారు. 2023 నవంబర్ 2, 2023 డిసెంబర్ 22, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ ఈ సమన్లు ఇచ్చింది.

కోర్ట్ తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, ఆ ఆదేశాలను సవాల్ చేయడం కానీ, వ్యక్తిగత హాజరు నుంచి కోర్టును మినహాయింపు కోరడం కానీ కేజ్రీవాల్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *