వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసారు.
కారణం ఏమై ఉంటుంది ?
దువ్వాడ శ్రీనివాస్ వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసారు. ఆ కృతజ్ఞత చూపడానికి అన్నట్టు, జగన్ గారే నాకు జీవితాన్ని ఇచ్చారు అని పదే పదే చెప్పడంతో పాటు, ప్రత్యర్ధి పార్టీ నేతలపై అసభ్యకర భాషతో రెచ్చిపోయేవారు, ముఖ్యంగా అచ్చేమ్ నాయుడు ని, జనసేన అధ్యక్షుడు పవన్ ను ఎక్కువ టార్గెట్ చేసి, జగన్ దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసేవారు.
ఒక సందర్భంలో, పవన్ ను చెప్పుతో కొడతానని, చెప్పు చూపిస్తూ, మీడియా తో మాట్లాడితే, దానికి ఆగ్రహించిన జన సైనికులు, అతని ఇంటి మీద దాడికి వెళితే, కిక్కురుమనలేదు.
ఎవరు ఎక్కువ తిడితే వారికే వైసీపీ లో మంచి పదవులు వస్తాయని, వైసీపీ నుండి బయటకు వచ్చినవారే చెప్పినట్టుగా,
దువ్వాడ కృషి కి మెచ్చి, దువ్వాడ వరుసగా ఎన్నికల్లో ఓడినా, ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్.
అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
భార్య ఉండగా, ఆమెతో విభేదాల కారణంగా, గత కొద్ది నెలలుగా, దివ్వెల మాధురి తో, ఆయన కలిసి వుండడంతో , దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతో, సోషల్ మీడియా లో దువ్వడపై చాలా విమర్శలు వచ్చాయి, అయన బాగా, ట్రోలింగ్ కు కూడా గురి అయ్యారు.
మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంస్టాగ్రామ్ రీల్స్ చెయ్యడం, , తిరుమల పర్యటనలో ఫొటోషూట్, అన్ని చానళ్లకు మాధురి తో కలిసి ఇంటర్వ్యూ లు ఇవ్వడం, ఇలా చాలా వివాదాలు అతన్ని చుట్టుముట్టడంతో, వైసీపీ పార్టీ లో కూడా దువ్వాడ కార్యక్రమాలు, పార్టీ ఇమేజ్ కు చేటు చేస్తున్నాయని, చాలా మంది భావించడం , దువ్వాడ ను సస్పెండ్ చెయ్యకపోతే, కష్టం అని జగన్ కు వారు చెప్పడం వల్లే , దువ్వాడ ను వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసారా ?
ఆ చిన్న కారణానికే జగన్ ఎందుకు సస్పెండ్ చేస్తాడు, పైగా వాటిని జగన్, ఇలాంటి చర్యలను పట్టించుకోడని కూడా టాక్ వుంది.
పైన చెప్పుకున్న కారణాలతో అయితే, జగన్ దువ్వాడ ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి , కానీ అవన్నీ పట్టించుకోని జగన్ , మరి ఇప్పుడే ఎందుకు జగన్ దువ్వాడ ని, ఏ కారణంతో సస్పెండ్ చేసాడని ఆరా తీస్తే ఒక కధనం వినిపిస్తోంది.
.ఈమధ్యే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న, దువ్వాడ శ్రీనివాస్, మాధురి , బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు… నారా లోకేష్ అని ఇద్దరూ ఒకే సారి సమాధానం చెప్పడమే కాకుండా, లోకేష్ యువకుడు, తెలివైనవాడని, సీఎం పదవి ఇస్తే బాగా పని చేస్తారని, పొగిడేశారు.
ఈ వార్త జగన్ కు ఎలాగోలా తెలిసిందట, ఇన్నాళ్లు ఏ తప్పులు చేసినా జగన్ పట్టించుకోలేదు కానీ, , ప్రధాన ప్రత్యర్థి పార్టీ నాయకుడైన లోకేష్ ను అంతగా పొడిగితే జగన్ ఊరుకుంటాడా? అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారట.
ఏ తప్పు చేసినా, జగన్ పట్టించుకోవడం లేదని ధీమాతో వుండి, ఇంకా అలాంటి తప్పులతో చెలరేగిపోతున్న దువ్వాడ,
పాపం లోకేష్ ను పొగిడి, జగన్ దృష్టిలో ఇదే, పెద్ద నేరంగా మిగిలి, సస్పెండ్ అయ్యాడు.
అయితే, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక, దువ్వాడ వీడియో రిలీజ్ చేస్తూ, పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపించి, అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వల్లే తాను ఈస్థాయి లో వున్నానని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి పార్టీ నుండి సస్పెండ్ అయ్యాక, ఇంక దువ్వాడకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేన, బీజేపీ లో కానీ చేరే చేరుదామన్నా అది కుదరని పని, అంతలా ఆ పార్టీ నేతలను దూషించాడు. అందుకే ఇప్పుడు సస్పెండ్ అయినా, దువ్వాడ మరో మార్గం లేక, జగన్ నే ప్రశంసిస్తూ సైలెంట్ గా వుండిపోయాడు.
మరి దువ్వాడ, భవిష్యత్ కార్యాచరణ ఏమిటో , త్వరలో తెలిసే అవకాశం ఉందేమో చూడాలి.