Death sentence to Kerala nurse nimisha priya

కేరళ నర్స్ నిమిష ప్రియకు యెమెన్ లో 16 లోగా మరణ శిక్ష ఆగుతుందా ?

10th July 2025

 

కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఆమెను ఉరి నుంచి కాపాడే మార్గాలేంటి?

నిమిషా ప్రియ ఎవరు? ఎందుకు యెమెన్ వెళ్లారు?

పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ, 2008లో ఉపాధి కోసం యెమెన్ దేశానికి వెళ్లారు. అక్కడే 2011లో ఓ భారతీయుడైన టామీ థామస్‌ను వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా భర్త, కుమార్తె తిరిగి ఇండియాకు వచ్చినా, నిమిషా మాత్రం అక్కడే ఉండిపోయారు.

 

క్లినిక్, భాగస్వామి, ఆ తర్వాత జరిగిందేమిటి?

నిమిషా యెమెన్‌లో ఓ ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించారు. స్థానిక భాగస్వామిగా మహది అనే వ్యక్తిని తీసుకున్నారు. మొదటిది బాగానే నడిచినా, తరువాత విభేదాలు తలెత్తాయి. ఫిజికల్, మెంటల్ వేధింపులు మొదలయ్యాయి.

2016లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మహది వేధింపులు కొనసాగించడంతో, నిమిషా అతనికి మత్తుమందు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ మోతాదు ఎక్కువవడంతో మహది మరణించాడు

 

కోర్టు తీర్పు: మరణశిక్ష విధింపు

2017లో ‘సుప్రీం జుడీషియల్ కౌన్సిల్’ నిమిషాను దోషిగా తేల్చింది. ఇప్పుడామెకు యెమెన్ అధ్యక్షుడి ఆమోదంతో మరణశిక్ష ఖరారైంది. ఈ శిక్షను బ్లడ్ మనీ (పరిహారం) చెల్లించడం ద్వారా తప్పించుకునే అవకాశముంది. అయితే ఆ డబ్బు ఎంతో తెలియదు.

 

బ్లడ్ మనీ – ఏకైక మార్గమా?

బాధితుని కుటుంబం బ్లడ్ మనీ తీసుకుంటే నిమిషా ప్రియ ప్రాణాలు దక్కే అవకాశం ఉంది. ఆమె తల్లి ప్రేమకుమారి, ప్రస్తుతం కొచ్చిలో ఇళ్లలో పని చేస్తూ కూతురిని రక్షించేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రవాస భారతీయులు కూడా సహాయానికి ముందుకొస్తున్నారు.

భారత్ ప్రభుత్వం పాత్ర

భారత్‌కు యెమెన్‌తో అధికారిక సంబంధాలు లేవు. అయినా విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమీకరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక న్యాయవాదికి 19,871 డాలర్లు చెల్లించారు. కానీ మొత్తం 40,000 డాలర్లు కావాలంటున్నారు.

 

మరణశిక్ష ఎలా అమలు చేస్తారు యెమెన్‌లో?

యెమెన్‌లో ప్రస్తుత విధానం ప్రకారం, మోపే హద్ శిక్ష అమలులో ఉంటుంది.

 బాధితుడిని నేలపై పడుకోబెట్టి

 ఆటోమేటిక్ రైఫిల్‌తో గుండెల ప్రాంతంలో కాల్చడం జరుగుతుంది

ఇది శరీరాన్ని అత్యధిక నొప్పితో విడిచిపెట్టే పద్ధతిగా భావించబడుతుంది.

“Save Nimisha Priya International Action Council” అనే గ్లోబల్ కౌన్సిల్ ఈ విషయంలో చురుగ్గా పని చేస్తోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా బ్లడ్ మనీకి అవసరమైన నిధులను సమీకరించే ప్రయత్నంలో ఉంది.

 

నిమిషా ప్రియ కేసు కేవలం ఓ నర్సు కథ కాదు. ఇది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల భద్రతపై ప్రశ్న. ఇప్పటికైనా భారత ప్రభుత్వం, మానవ హక్కుల సంస్థలు మరింత గట్టిగా స్పందించాలి. సమయం చాలా తక్కువగా ఉంది

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *