లక్ష్మి పార్వతి కి తెలంగాణ హైకోర్ట్ లో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని సిటి సివిల్ కోర్టు , ఆమెకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు తెలంగాణ హై కోర్ట్ కొట్టివేసింది.
అసలు ఏమి జరిగింది అంటే, బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని, అందుకు సాక్ష్యంగా, బసవతారకం ట్రస్ట్ కు ఎన్టీఆర్ అదివరకే రాసిన విల్లు కు అనుబంధంగా , మరో అదనపు విల్లు ఎన్టీఆర్ 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసారని, సిటి సివిల్ కోర్ట్ కు అందజేసింది. అయితే, దానికి సాక్షిగా జె. వెంకట సుబ్బయ్య సంతకం పెట్టారని, ఇప్పుడు ఆ వెంకట సుబ్బయ్య బ్రతికి లేరు, కానీ, ఆ వెంకట సుబ్బయ్య, అతని కుమారుడు జెవి ప్రసాదరావు కు, ఈ వీలునామా మాట చెప్పారు కాబట్టి, తన పిటిషన్ కు ఆధారంగా ఈ జెవి ప్రసాదరావు చేత కోర్ట్ లో సాక్ష్యం చెప్పించింది. ఆ సాక్ష్యాన్ని అంగీకరించిన , సిటి సివిల్ కోర్టు , బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మి పార్వతి ని నియమించాలని , ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అయితే, ఈ తీర్పు పై, ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ లు హైకోర్టులో, 2009 లో సవాల్ చేశారు.
ఇన్నాళ్లకు తెలంగాణ హై కోర్ట్, ఈ కేసు లో తీర్పు చెప్పింది.
హై కోర్ట్ లక్ష్మి పార్వతి కి , అనుకూలంగా సిటీ సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు కొట్టివేసింది.
తీర్పు కొట్టివేస్తూ హై కోర్ట్ ఏమి వ్యాఖ్యానం చేసిందంటే,
“1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదు, ఈ సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదు, విల్లుపై మొదటగా, సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య చనిపోయినా, అతని వారసుడు మరియు , కుమారుడు అయిన జెవి ప్రసాదరావు ను, సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్ధం, సాక్షి సంతకం చేసిన జెవి ప్రసాదరావు , కనీసం తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కూడా సిటి సివిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అయినప్పటికీ దిగువ కోర్టు ప్రసాదరావు నోటి మాట ఆధారంగా సాక్షిగా పరిగణలో తీసుకొంది, కాబట్టి , ఇచ్చిన తీర్పు చెల్లదు “.
మొత్తానికి, బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా తాను వుండాలన్న కలలు కలలు అయ్యాయి, లక్ష్మి పార్వతికి.