Dark Mode Light Mode

దర్శకుడు శంకర్ కు షాక్ ఇచ్చిన ED…….అసలు వివాదం ఏమిటి?

ED has seized Rs 10 crore worth of assets belonging to Shankar in a copyright dispute related to the movie Robot ED has seized Rs 10 crore worth of assets belonging to Shankar in a copyright dispute related to the movie Robot

తెలుగు లో శ్రీమంతుడు సినిమా వివాదం గుర్తుంది కదా. 

కొరటాల శివ దర్శకుడు, మహేష్ బాబు హీరో, ఆ మూవీ హిట్ అయింది, కానీ, ఆ సినిమా కధ నాదేనంటూ, శరత్ చంద్ర అనే రచయిత ( బీజేపీ నాయకుడు, టీవీ డిబేట్ లలో తరుచు కనపడే విల్సన్ కలం పేరు ఇది ) , తనకు పారితోషికం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మూవీ క్రెడిట్స్ తనకు ఇవ్వాలని, టైటిల్స్ లో కూడా రచయితగా నా పేరు ఉండాలి అని చాలా ఏళ్ళు కోర్టుల్లో పోరాటం చేసారు.

కోర్ట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, ఇప్పుడు ఆ కేసు ఏమయ్యిందో తెలియదు.

Advertisement

ఇప్పుడు అలాంటి వివాదమే, తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో జరుగుతోంది.

2011 లో తమిళ్ లో యంథిరన్ పేరుతో, తెలుగులో రోబో పేరుతో సినిమా వచ్చింది, శంకర్ దర్శకుడు, రజనీకాంత్ హీరో. ఆ సినిమా తమిళ్ లో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. 300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు గాను 11.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడు దర్శకుడు శంకర్.

అందరు అప్పుడు శంకర్ క్రియేటివిటీని, ప్రతిభను కొనియాడారు, వన్ అఫ్ ది బెస్ట్ క్లాసిక్ అండ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.

అయితే, మన తెలుగు సినిమా శ్రీమంతుడు లాగే, ఈ రోబో సినిమా కధ నాదేనంటూ, తన రచన జిగుబా అనే తన నవలకు కాపీ అని, ఆరూర్ తమిళ‌నాథన్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు, 2011 లో అంటే 14 ఏళ్ళ క్రితం. శంకర్ ఈ విషయాన్ని అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు.

కానీ ఈ తమిళ‌నాథన్ అప్పటినుండి ఈ విషయంలో కోర్టుల్లో పోరాడుతూనే వున్నాడు.

ఈ మధ్యే కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం, ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్ట్ ఇచ్చింది, … ఆ నవల, ఈ సినిమా కథ ఒకటే, అంటే రోబో మూవీ, కాపీ కథే అని రిపోర్ట్ ఇచ్చింది. ఇది కాపీ రైట్ చట్టం సెక్షన్ 63 ప్రకారం నేరమే.

రోబో మూవీ వివాదం లోకి ED

అయితే, ఈ వివాదం లోకి ED (Enforcement directorate) ప్రవేశించి ,శంకర్‌కు షాక్ ఇచ్చింది… రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ వివాదంలో ఈడీ శంకర్ కు సంబంధించిన 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది…ఈనెల 17న, మనీలాండరింగ్ చట్టానికి సంబంధించి ఈ చర్య తీసుకుంది.

కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించే కేసుల్లో స్థిరాస్తుల స్వాధీనం ఇదే మొదటిసారి అనీ ఈడీ ఓ ప్రకటనలో చెప్పుకుంది…

ఒక కథ కాపీ రైట్ వివాదం లో ఈడీ ఎలా ప్రవేశిస్తుందో అర్ధం కాదు, భవిష్యత్తులో దీనికి సమాధానం దొరుకుతుందేమో.

అసలే భారతీయుడు , గేమ్ ఛేంజర్ మూవీ ల డిజాస్టర్లతో , శంకర్ లో క్రియేటివిటీ నశించింది, సరుకు అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడని విమర్శలు ఎదుర్కొంటున్న శంకర్ కు తాజా సంఘటన మరో పెద్ద ఎదురు దెబ్బ.

ఈ ఈడీ అంశంలో, శంకర్ ఎలా ప్రొసీడ్ అవుతాడో చూడాలి.

ఒకటి మాత్రం అర్ధం కాదు, కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, దర్శకుడు, హీరో లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు, కానీ ఆ సినిమా
కధా రచయితలకు మాత్రం తక్కువ ఇస్తారు.

అలాగే ఈ కధ నాదేనంటూ, ఎవరైనా వారి దగ్గరకొచ్చి చెప్పినా , లేదా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినా, వెంటనే, అది పరిశీలించి, నిజం గా అనిపిస్తే, ఒప్పుకుని, ఆ రచయితకు అప్పుడే కొన్ని లక్షలు ఇచ్చి, వారి పేరు సినిమా టైటిల్స్ లో ఎందుకు వేయడానికి వొప్పుకోరో అర్ధం కాదు. కోట్లు తీసుకుంటున్న వారికి ఈ కక్కుర్తి ఎందుకో. గోటితో తో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు.

ఇప్పుడు శంకర్ అయినా, అప్పుడు కొరటాల శివ అయినా , ఇదే తప్పు చేసారు. భవిష్యత్ దర్శకులు , ఇలా ,కధ చౌర్యం గురించి ఫిర్యాదులు వచ్చినప్పుడు, వెంటనే, పరిష్కరించుకోకపోతే, ఇలాగే వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి, డబ్బు, కీర్తి పోగొట్టుకునే అవకాశం కలుగుతుంది.

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Add a comment Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Previous Post
ycp-dramas-being-ridiculed-ipac-drama-failed

అభాసుపాలవుతున్న వైసీపీ డ్రామాలు....IPAC గుట్టు రట్టు....

Next Post
news vice chancellors for universites in andhra pradesh were appointed

చంద్రబాబు నియమించిన కొత్త వైస్ ఛాన్సలర్స్ తో , యూనివర్సిటీలకు పూర్వ వైభవం

Advertisement