ఎస్సీలు మతం మారిన మారిన రోజే, వారి ఎస్సీ హోదాను కోల్పోతారు…. ఏపీ హైకోర్టు షాకింగ్ తీర్పు

SCs lose their SC status the day they convert to another religion.... AP High Court's shocking verdict,

2nd May 2025

ఎస్సీలు క్రైస్తవం లోకి మారితే, వారికి ఎస్సి హోదా ఉంటుందా, వారికి ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ వర్తిస్తుందా ?

ఈ విషయాన్ని, ఒక కేసు విషయం లో తీర్పు ఇస్తూ, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తేల్చేసింది.

ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌, 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు, యేమని అంటే, తన గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి మరో ఐదుగురు తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారని. దీనితో పోలీసులు ఈ ఎ.రామిరెడ్డి, ఆ ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

కోర్ట్ లో ఈ కేసు నడుస్తున్నపుడు, ఫిర్యాదుదారు పాస్టర్‌ ఆనంద్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్‌ ధృవపత్రం ఇచ్చారని గుర్తుచేశారు.

దానికి పిటిషన్ వేసిన నిందితుల తరపు న్యాయవాది వాదిస్తూ, “ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం షెడ్యూల్డ్‌ కులాలు ఆర్డర్‌-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదు కాబట్టి ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండి “, అని కోరారు.

అప్పటినుండి ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు, పిటిషనర్ తరుపున వాదించిన న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, ఈ రోజు తన తీర్పు వెలువరించింది. నిందితుల పై కేసు కొట్టేసింది.

అయితే, ఈ కేసు కొట్టేస్తూ, హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ తన తీర్పు లో, మతం మారిన ఎస్సీ కులస్తుల హోదా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు.

“షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు, క్రైస్తవంలోకి మారిన రోజే, వారి ఎస్సీ హోదాను కోల్పోతారు, వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరు , ప్రస్తుతం ఈ పాస్టర్ కు ఎస్సీ హోదా లేదు, కనుక , ఈ చర్చి పాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద ఈ నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేయడం తప్పు, ఈ పాస్టర్ , ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, పోలీసులు ఛార్జిషీట్‌ వేయకుండా ఉండాల్సింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదుదారుడు అయిన పాస్టర్ రక్షణ పొందలేరు. “

విచిత్రం ఏమిటంటే, ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో, ఇంకా పెండింగ్‌లో ఉంది.

ఈ సందర్భంగా గమనించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు.

క్రైస్తవ మతం లో కుల వ్యవస్థ లేదు ,ఎస్సీలు క్రైస్తవం లోకి మారితే, కుల వ్యవస్థ వర్తించదు అని సుప్రీమ్ కోర్ట్
గతంలోనే తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఆధారంగానే , హై కోర్ట్ ఈ కేసు లో తీర్పు ఇచ్చింది.

అగ్రకులాలనుండి , ఎస్సీ కులాల రక్షణ కై, ఈ ఎస్సీ /ఎస్టీ ఎట్రాసిటీ చట్టం తెస్తే, రాను రాను ఈ చట్టం దుర్వినియోగం అవుతోంది. కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ శాతం ఎస్సీ లు క్రైస్తవ మతం లోకి మారిపోయారు, ఆ మతాన్ని ఆచరిస్తారు, అక్కడే ఈ ఎస్సీ /ఎస్టీ ఎట్రాసిటీ కేసు లు ఎక్కువ ఉంటున్నాయి. ఈ కేసు పెడితే, బాధితులకు పరిహారం వస్తుందని, అంతే కాక , ఎంత ఎక్కువ మంది మీద పెడితే, అంత ఎక్కువ పరిహారం వస్తుందని, కొంతమంది దళారులు వుండి , వారిచే, ఇలా చేయిస్తున్నారన్న ఆరోపణలు కూడా వున్నాయి.

ఈ దళారులు ఈ తరహా కేసు లు వేయించి, ప్రభుత్వం పరిహారం ఇస్తే, మాకింత, మీకింత, అని సెటిల్ చేస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. మతం మారిన ఈ ఎస్సీలు క్రైస్తవ పద్ధతి లో చర్చిల్లో పెళ్లిళ్లు చేసుకున్నా , ఫంక్షన్స్ చేసుకున్నా, గ్రామాల్లో రెవిన్యూ రికార్డుల్లో మాత్రం , వీళ్ళు ఎస్సీల గానే వుంటారు, అలాగే సర్టిఫికెట్ లో ఉంటుంది.

ఈ మతం మారిన ఎస్సీ లు , క్రైస్తవ మతం ఆచరిస్తూ వుంటారు, కానీ ఎస్సీ ల క్రింద రిజర్వేషన్స్ తో, ఉద్యోగాలు, పొందుతూ వుంటారు. అలాగే ఈ మతం మారిన ఎస్సీ లు , చెల్లవని తెలిసినా, ఎస్సీ ఎట్రాసిటీ క్రింద కేసు లు కూడా పెడుతూ వుంటారు. ఒకరకంగా ప్రభుత్వాన్ని మోసం చెయ్యడమే . నిఘా పెట్టాల్సిన అధికారులు నిఘా పెట్టరు , ప్రభుత్వాలు కూడా తమ ఓట్ బ్యాంకు కోసం ఈ తప్పుడు పద్దతులపై చర్యలు తీసుకోవట్లేదు.

కనీసం కేంద్రం అయినా స్పందించి , ఈ తప్పుడు పద్దతులను ఆపాలి, నిజమైన ఎస్సీ లకు న్యాయం చెయ్యాలి,
వారి హక్కులను కాపాడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *